అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం పట్ట జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్రెడ్డి కన్నుమూశారనే విషయం నమ్మశక్యం కాలేదని ఆయన అన్నారు. మంచి సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. కాగా గౌతమ్రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఎల్లుండి నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి బయలు దేరారు. రేపు ఉదయం వరకు స్వస్థలానికి చేరుకోనున్నారు.