అమరావతి : రేపు ఉదయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒమైక్రాన్, కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా పార్టీ సమావేశాన్ని వాయిదా వేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యే సమయంలో కరోనా వ్యాప్తి ఉండటం బాధాకరమని,ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తలు పాటించాలని,మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు