Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
పార్వతీపురం జిల్లా కురుపాంలో ముందుగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఇటీవల అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆ పాఠశాల పరిస్థితులను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ తొందరలోనే ఖరారు కానుంది. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ అవుతారు.