హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): జనసేన అధినేత పవన్కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పెద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్హాల్లో సోమవారం రాత్రి విశ్రాంతి తీసుకొంటున్నారు.
ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసం కారణంగా పవన్ అనారోగ్యం పాలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ నేతలతో ఆయన మంగళవారం ఉదయం 11 గంటల భేటీ వాయిదా పడింది.