అమరావతి : దేశంలో లౌకికవాదానికి ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి జగన్కు మంచి అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేంద్రం మెడలు వంచుతానని అన్న జగన్ తన స్వార్థం కోసంకేంద్రం వద్ద మోకాలు వంచాడని ఎద్దేవా చేశారు.అధికారం కోసం పాదయాత్ర చేసిన జగన్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయడం లేదని రామకృష్ణ ఆరోపించారు. రైతాంగ సమస్యలపై ఏపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు .