అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం జగన్ మాజీ కాబోతున్నారని చెప్పారు. జగన్ పతనం ప్రారంభమైందని, రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతుందని చింతా మెహన్ అన్నారు. తిరుపతిలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు సీఎం జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందని ఆక్షేపించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిన విషయం తెలిసిందే.