అమరావతి : ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చిన్నవయసులో దూరం కావడం బాధకరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన లేని లోడు పూడ్చలేనిదని అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మేకపాటి గౌతం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై పనిచేశారని అన్నారు. సుదీర్ఘంగా ఆలోచించి ప్రభుత్వ నిర్ణయాల తీసుకునే వారని అన్నారు.
మేకపాటి గౌతం రెడ్డి అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. మేకపాటిని సోదరుడుగా భావిస్తానని అతని మరణం కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతా బాధగా ఉందని పేర్కొన్నారు.