అమరావతి : న్యాయవాద వృతి ఎంతో గొప్పదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్(CJ Chandrachud ) అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా న్యాయవాద వృత్తి(Lawyer Profession) ని ఎంచుకుంటుండడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ నిస్పాక్షిత(Selflessness) , నిజాయితీ, సమర్ధత వంటి లక్షణాలను చిన్ననాటి నుంచే అలవరుచుకుంటే ఉన్నతస్థానంలోకి రాణించే అవకాశం ఉంటుందని సూచించారు. న్యాయవాదవృత్తి ఎంచుకున్న విద్యార్థులు న్యాయవృత్తిని గౌరవిస్తూ విద్యనభ్యసించాలన్నారు.
రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజే
సీజేఐ చంద్రచూడ్ దంపతులు మంగళవారం రాత్రి తిరుపతి నుంచి తిరుమల(Tirumala) చేరుకోనున్నారు. తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో వారు బస చేయనున్నారు. బుధవారం తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు.