తిరుమల : అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను ఆహ్వానించారు. ఈమేరకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
జూన్ 5వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వివరించారు. జూన్ 9న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.