అమరావాతి : అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానుల చట్టం రద్దు నిర్ణయంపై మంత్రి ఇది ఇంటర్వెల్ అని, శుభం కార్డు త్వరలో వేస్తామని ప్రకటించడంపై స్పందించారు. ఇంటర్వెల్ కాదు మీకు శుభం కార్డును వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ మెుదటి నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తునే ఉందని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం శుభపరిణామమని ఆయన అన్నారు.