తిరుమల: తిరుమల శ్రీవారి నడకదారిలో ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (DSP Krupakar) గుండెపోటుతో మృతిచెందారు. ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 26, 27 తేదీల్లో తిరుమలలో (Tirumala) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా విధుల్లో భాగంగా డీఎస్పీ కృపాకర్ తిరుమలకు వచ్చారు. శనివారం ఉదయం మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా.. 1805 మెట్టు వద్ద ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. తోటి సిబ్బంది దవాఖానకు తరలించేలోపే ఆయన మరణించారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం వియవాడ సమీపంలోని పోరంకి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.