అమరావతి : నేవీ డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్లో భారత నౌకదళ వాయు విభాగం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేవీ డే (Navy Day) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు అమర్నాథ్, విడదల రజినితో బాటు నేవీ, వాయు అధికారులు పాల్గొన్నారు.
నౌక, విమానాలు, హెలికాప్టర్లు, జలంతర్గామి విన్యాసాలు, ఈస్ట్రన్ నావెల్ కమాండ్ బాండ్ ఆధ్వర్యలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ ఆకట్టుకున్నాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని వాయుసేల కాపాడడం, ఉగ్ర చెరల్లో ఉన్న బందీలను విడిపించడం తదితర ప్రదర్శన ఆహుతును విశేషంగా ఆకట్టుకుంది .