అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ సీఎం జగన్కు నిజంగా తాము గెలుపొందుతామని నమ్మకముంటే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని 175 స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపిస్తారని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ జగన్కే ఓట్లేసేంత అమాయకులు కాదని పేర్కొన్నారు.
లోకేశ్ జూమ్ సమావేశంలోనే వైసీపీ వాళ్లు దొంగల్లా చొరబడ్డారని విమర్శించారు. పిల్లలను భయపెట్టి జూమ్ కాన్ఫరెన్స్లోకి ఎమ్మెల్యేలు వచ్చారని మండిపడ్డారు. జూమ్ కాన్ఫరెన్స్లోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.