హైదరాబాద్ : రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల నాయకులపై వ్యాఖ్యలతో తన దృష్టిని మరల్చుకునే పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) పై సవాళ్ల వర్షం కురిపించారు. సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే మీరే సీఎం అవుతారంటూ పేర్కొన్నారు. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్టీవీటీసీ) చైర్మన్గా పోసాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు ముమ్మరం అయ్యాయి. పబ్లిక్ డొమైన్(Public Domine) లో చంద్రబాబు పై కొన్ని నిజాలు ఉన్నాయని ఆరోపించారు.
నిజాయితీపరుడు అయితే హెరిటేజ్(Heritage) ను మోహన్బాబు నుంచి ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినపుడు చంద్రబాబు పార్టీ కార్యకర్త కూడా కాదని విమర్శించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని పబ్లిక్ డొమైన్లోనే ఉందని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలపై హామీలు గుప్తిస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబితే రాబోయే ఎన్నికల్లో ఓ కమ్మవ్యక్తిగా మీ కోసం పాదయాత్ర చేస్తానని, కమ్మ ఓట్లన్ని మీకే పడతాయని అన్నారు. ఈ ప్రశ్నలపై నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు సవాలు విసిరారు.