అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోబోదని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరి కొందరు గుంటూరు జిన్నాటవర్ సెంటర్ వివాదంతో పాటు మరికొన్ని కట్టడాలపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పని సూచించారు.
ఎన్నో ఏండ్ల క్రితం ఏర్పాటుచేసిన చిహ్నాలు తొలగించాలనడం సరికాదని బీజేపీ నాయకులకు హితవు పలికారు. అబ్దుల్ కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయాలని వారికి సూచించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నాయకులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.