Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. చంద్రబాబు భవిష్యత్తు కోరుకునే వారే తన చర్యలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని రకాలు ప్రశ్నించినా తన పని తాను చేస్తానని స్పష్టం చేశారు..
గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకుంటే బాగుండేదని హరిరామజోగయ్య లేఖలో అన్నారు. రాజకీయ అనుభవం లేని ఇద్దరు నేతల సలహాలతోనే ఆయన ఓడిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాను చచ్చేంతవరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. పవన్కళ్యాణ్ అధికారం చేపట్టే వరకు తన పోరాటం ఆగదని కరాఖండీగా చెప్పేశారు. చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కోరుకునే వారు.. తను చర్యలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఏ విధంగా ప్రశ్నించినా తన పని తాను చేసుకుంటూ పోతానని తెలిపారు.