అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandra Babu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) సరదా వ్యాఖ్య చేసి హాట్ టాపిక్గా మారారు. నిజాన్ని గెలిపిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి ఈసారి తాను కుప్పం (Kuppam) నుంచి పోటీ చేస్తా. ఎవరికి చంద్రబాబు కావాలో చేతులెత్తాలని కోరగా అందరు చేతులెత్తారు. మరి నేను అనగా మీరు కూడా కావాలని ప్రజలనుంచి సమాదానం రావడంతో ఇక ఆమె అసలు విషయాన్ని వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, కేవలం సరదా కోసమేనని అన్నారు. నాకు ఎలాంటి పదవులు వద్దని, చంద్రబాబు నన్ను బాగా చూసుకుంటున్నారని తెలిపారు. నా కంపెనీలో చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదని, జోక్గా అంటున్నానని, సీరియస్గా తీసుకోవద్దని, చంద్రబాబే కుప్పంలో ఉంటారని మరోసారి స్పష్టం చేశారు.