తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇద్దరు భక్తులు బర్డ్ ట్రస్ట్కు భారీ విరాళాలు (Huge donations ) అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టు ( Bird Trust ) కు రూ. 2.93 కోట్లు ను విరాళంగా అందజేశారు.
అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.10 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. నర్సారావు పేటకు చెందిన జె.రామాంజ నేయులు శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.