శ్రీశైలం : క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగకుండా పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న అన్నారు. క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు పొరుగు గ్రామాలకు వెళ్తున్న స్థానికులు కోందరు దేవస్థాన నిబంధనలను అతిక్రమిస్తూ మద్యం, మంసాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు.
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ మద్యం, మాంసాహారాన్ని తీసుకొని క్షేత్ర ప్రవేశం చేసేందుకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షి గణపతి వద్ద ప్రత్యేక చెక్ పాయింట్ ఏర్పాటు చేయడంతోపాటు టోల్ గేట్ వద్ద కూడా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక సెక్యూరిటీ విభాగంతో పాటు పోలీసుల బలగాలు ఉంటాయన్నారు. దేవాదాయశాఖ హెచ్చరికలు ఉల్లఘించిన వారిపై ఏపీ రిలీజియస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.