హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వెకేషన్ బెంచ్లో ఇరుపక్షాల మధ్య వాదనలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
రెండోరోజు శుక్రవారం అవినాష్రెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, సీబీఐ(CBI) తరుఫున న్యాయవాదులు ఎవరికి వారే తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసే సమయానికి వైఎస్ అవినాష్రెడ్డి, సునీతారెడ్డిల వాదనలు విన్న కోర్టు సీబీఐ వాదనలు శనివారం వింటామని విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సీబీఐ సమర్పించిన అనుబంధ కౌంటర్( CBI Petition)లో కీలక విషయాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది .
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 6.15 గంటలకు ముందే వైఎస్ జగన్కు తెలిసిందని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది . హత్య విషయం ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్కు తెలుసని అనుబంధ కౌంటర్లో సీబీఐ పేర్కొంది . జగన్కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది .