అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని రాజ్భవన్లో గవర్నర్ కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గుడివాడలోని సొంత కన్వెన్షన్లోనే మంత్రి క్యాసినోను నిర్వహించారని ఆధారాలతో వీడియో సాక్ష్యాలను సమర్పించారు. నిజ నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలపై దాడులు, పోలీసుల వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కమిటీ సభ్యులు వర్లరామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా కోరారు.
మంత్రిని సీఎం జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. క్యాసినో వ్యవహారం రాష్ట్రం మొత్తం నిర్వహించనున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గుడివాడ క్యాసినో ఘటనపై డీజీపీ చూసీచూడనట్లు నటిస్తున్నారని ఆరోపించారు.