అమరావతి : ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పునకు
గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఇకపై ఎన్టీఆర్ వర్సిటీ బదులు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు అధికారికంగా మారినట్లైంది.
గత రెండు నెలలక్రితం వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు అసెంబ్లీ ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్కు ప్రభుత్వం గవర్నర్కు పంపగా రెండు నెలల అనంతరం పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.