అమరావతి : ఏపీలో జగనన్న విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విద్యా దీవెన పథకం కింద చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్, రసుములను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం రివ్యూపిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల మధ్య వాదనాలు జరిగాయి.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, ప్రైవేట్ యాజమాన్యాల తరఫున న్యాయవాదులు విజయ్, వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించారు. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే కళాశాలలకు ప్రభుత్వం చెల్లించే ఫీజ్ రియింబర్స్మెంట్, రుసుంలు సకాలంలో చెల్లించరని, తిరిగి సమస్య ఉత్పన్నమవుతుందని , నేరుగా కళాశాలల ఖాతాల్లోకే నగదు జమ చేయాలని ప్రైవేట్ విద్యాసంస్థలు కోరుతున్నాయి.