అమరావతి: ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరం కావద్దన్న సంకల్పంతో ఏపీ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిందిని ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన(Vidya Deevana), సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను బుధవారం ఆయన విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను బటన్ నొక్కి విద్యార్థుల అకౌంట్లలో జమచేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల (Poor Students) కల నెరవేర్చడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో అరకొర నిధులు(Funds) విడుదల చేయడం వల్ల విద్యార్థులకు ఆ నిధులు సరిపోక చదువులను మధ్యలోనే ఆపివేశారని అన్నారు. రాష్ట్ర విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం ఇవ్వడం వల్ల రాబోయే సమాజానికి ఉపయోగపడే విద్యావంతులుగా ఎదుగుతారని అన్నారు.
విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీ (Top University)లో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల వరకు, మిగిలిన వారికి రూ.కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.