అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. విధులకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ( Government Teacher ) పై ఆటో డ్రైవర్ దాడి చేసి ఆభరణాలను దొంగిలించాడు. జిల్లాలోని బాలయపల్లి మండలం గొట్టిగాడి గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ టీచర్ హరిత (35) విధులు నిర్వహిస్తుంది.
రోజు మాదిరిగానే ఆటోలో గురువారం పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా గూడూరు గ్రామీణ మండలం కందలి వద్ద ఆటో డ్రైవర్ మార్గమధ్యలో ఆమెపై కత్తితో దాడి చేసి ఆమె మెడలో ఉన్నఆభరణాలను లాక్కొని పారిపోయాడు.స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.