తిరుమల : కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తులను టీటీడీ తయారు చేసి విక్రయిస్తుంది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సనాతన ధర్మప్రచార పరిషత్లో భాగంగా ప్రతి ఆలయంలో గోపూజను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించినట్లు తెలిపారు.
టీటీడీ ఉద్యోగుల భద్రత కోసం 15 కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తామని వివరించారు.