అమరావతి : కడప జిల్లా రాజంపేట తాలుకా ఒంటిమిట్ట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతమ్మవారికి ఓ భక్తుడు బంగారు హారాన్ని బహూకరించాడు. కర్నూల్కు చెందిన సి.పుల్లారెడ్డి బుధవారం ఉదయం రూ.1.85 లక్షల విలువ గల 38.042 గ్రాముల బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించాడు. ఆలయ ఏఈవో మురళీధర్కు దాత హారాన్ని అందజేశారు. అనంతరం హారానికి పూజలు నిర్వహించి, అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ గిరి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.