అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju)తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా(Resign) లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం త్వరలో చేపట్టనున్న దృష్ట్యా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల వైఎస్ షర్మీల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.
ఆదివారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రారంభించిన పాదయాత్రలో షర్మిల పాల్గొన్నారు. 2022 నవంబర్లో పీసీసీగా నియామకమైన గిడుగు రుద్రరాజు సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్కు సేవలందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించిన ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవీపీలకు సన్నిహితుడిగా మెలిగారు.