అమరావతి : ఫ్రీగా వస్తే ఫినాయిల్నైనా ఎగబడి తీసుకునే జనం నెయ్యి (Ghee) కోసం నానా తంటలు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా కొండాపురం ( Ghee Tanker ) మండలం అనంతపురం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదవశాత్తు నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్లో ఉన్న నెయ్యి నేలమట్టం అవుతుందని తెలుసుకున్న స్థానికులు ఇంట్లో ఉన్న బిందెలు, బకెట్లు, గిన్నెలు, ప్లాస్టిక్ జగ్గులు, ఇతర చిన్న చిన్న వస్తువులతో చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం ఎగబడ్డారు.
కడప జిల్లా కొండాపురం మండలం అనంతపురం సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా
నెయ్యి కోసం బిందెలతో ఎగబడ్డ జనం
ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు pic.twitter.com/UEsPNC8W1T
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2026