అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్పై (Talari Venkatrao) కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అతికష్టంమీద పోలీసుల సహకారంతో ఆయన బయటపడ్డారు. జీ కొత్తపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ శనివారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రాప్ ఘటనా స్థలానికి వెళ్లారు.
అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో ఆయన గాయపడ్డారు. తోపులాటలో ఎమ్మెల్యే అంగి చినిగిపోయింది. కాగా, పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.