అమరావతి : ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని దుయ్యబట్టారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేమి లేదని ఆరోపించారు.
ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభుత్వానికి ఆశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.