తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది .రెండు కంపార్టు మెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 4 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 71,158 మంది భక్తులు దర్శించుకోగా 27,968 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని తెలిపారు.