అమరావతి : ఏపీలోని భీమవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (Ramanjaneyul) మంగళవారం జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని వెల్లడించారు. ఐదేళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. సమాజం కోసం త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి పవన్ అని అన్నారు. మూడు పార్టీల కలయిక కోసం పవన్ ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు.
రామాంజనేయులు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన ఆయన త్రిముఖ పోటీలో ఓడిపోయారు.