అమరావతి : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) రామవరంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనపర్తి నుంచి 1983, 1985, 1994, 1999 నాలుగుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. 2014లో మూలారెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మూలారెడ్డి మృతిపట్ల టీడీపీ నాయకులు సంతాపం ప్రకటించారు.