అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. విశాఖలో పర్యటన ముగించుకున్న సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్ లో తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. ఏరియల్ సర్వే ద్వారా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు చేరుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వరద బాధితులను ఆదుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు.