కడప: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
బాధితులు రాయచోటి నుంచి కడప వస్తున్నారని, ఈ క్రమంలో గువ్వలచెరువు ఘాట్ మూలమలుపు వద్ద కారుపైకి లారీ దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.