అమరావతి : కడప(Kadapa) జిల్లా పులివెందులలో కాల్పుల(Firining) ఘటన కలకలం సృష్టిస్తోంది. అప్పు వ్యవహారంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద దిలీప్, మస్తాన్ బాషాలపై భరత్కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరుపడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదన్న కారణంగా గొడవ జరగడంతో తన వద్ద ఉన్న పిస్టోల్(Pistol)తో ముందుగా బావ, బామ్మర్ధిలైన దిలీప్పై అనంతరం మస్తాన్ బాషాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా ఈ ఘటనలో గాయపడ్డ దిలీప్ను పులివెందుల ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ మస్తాన్ బాషాను కడప రిమ్స్కు తరలించారు.
కాల్పులు జరిపిన భరత్ కుమార్ గతంలోనూ పలువురిపై దాడులు, సెటిల్మెంట్ కేసుల్లో పిస్టోల్తో బెదిరింపులకు పాల్పడ్డ ఘటనపై పోలీస్స్టేషన్లో కేసులు నమోదయి ఉన్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్కుమార్ యాదవ్కు భరత్కుమార్ సమీప బంధువు. వైఎస్ వివేకా హత్య కేసులోనూ గతంలో సీబీఐ అధికారులు భరత్ యాదవ్ను ప్రశ్నించారు. నిందితుడు భరత్కుమార్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.