అమరావతి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గూడ్స్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆగిన గూడ్స్ రైలు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా పుట్లూరు రైల్వే గేట్ వద్ద దాదాపు రెండు గంటల పాటు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. మరో ఇంజిన్తో గూడ్సు రైలును తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.