అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో రోగులకు పెను ప్రమాదం తప్పింది. దవాఖానలోని స్టోర్ రూంలో ఈ రోజు షార్ట్ సర్య్యూట్తో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
దీంతో స్టోర్రూంలో ఉన్న పరుపులు, ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు తదితర వస్తువులు దగ్ధం కాకుండా కాపాడారు. పక్కనే ఉన్న రోగుల గదికి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని స్థానిక వైద్యులు పేర్కొన్నారు. తెనాలి పట్టణ మూడో టౌన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్కుమార్, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.