అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న పారిశ్రామక సెజ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న అచ్యుతాపురంలో విషవాయువు లీకై వందమంది కార్మికులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా ఇవాళ జిల్లాలోని పరవాడ పారిశ్రామిక పార్కులోని ఫెర్రో కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కూడా దగ్ధమై మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.