అమరావతి : ఏపీ కాపునేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు (Cinema Peple) రాజకీయాల్లో పనికిరారని పరోక్షకంగా చిరంజీవి, పవన్కల్యాణ్ ఉద్దేశించి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి అనతికాలంలోనే పార్టీ జెండాను ఎత్తివేశారని, పవన్ కల్యాణ్ కూడా అదే దారిలో పయనిస్తాడని అన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు ఉండగా కేవలం 20 సీట్లకు మాత్రమే జనసేన అధినేత పరిమితమవడం శోచనీయమని అన్నారు.
20 సీట్ల కోసం పవన్కు నేను ఎందుకు సపోర్ట్ చేయాలని, ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే నేను వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్కల్యాణ్ (Pawan Kalyan) ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు(Chandra Babu) తనను అనేక ఇబ్బందులకు గురిచేశాడని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓటమి కోసం పనిచేస్తానని వెల్లడించారు. ఏపీలో మరో 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు.