శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కళ్లెం వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, బుల్లితెర నటి మీనాకుమారి కుటుంబసభ్యులతో స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం క్షేత్రానికి వచ్చిన వీరు ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానంతరం అర్చక పండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.