అమరావతి : ఏపీలో వివాద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలో ఉండే వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఈసారి జనసేన అధినేత పవన్కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు పలు సూచనలు చేశారు. చంద్రబాబును నమ్మి అతడి వంచన చేరి కూటమి ద్వారా పోటికి సిద్ధమైన పవన్కల్యాణ్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని అన్నారు. ఎన్నికల్లో పవన్ను చంద్రబాబే(Chandra Babu) ఓడిస్తాడని, అభిమానులు అప్రమత్తంగా ఉండి పవన్ను రక్షించుకోవాల్సిన అవసరం జన సైనికులకు ఉందని ఆయన సూచించారు.
వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్లు (Brabd Ambasidor) చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు ఏపీలో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి, 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లివ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు, జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయని వెల్లడించారు. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవని తెలిపారు.