తిరుపతి : తిరుపతిలో రోగుల కోసం ఏసీ, ఫర్నీచర్, గ్యాస్లైన్లు తదితర వసతులతో నెఫ్రో ప్లస్ భవనాన్ని95 ప్రత్యేక గదులుగా మార్చాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. సోమవారం స్విమ్స్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల ప్రగతిపై జేఈవో వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మతో కలిసి టీటీడీ, స్విమ్స్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ జనవరి 13లోపు 30 గదులు, ఫిబ్రవరి నెలాఖరులోపు మిగిలిన 65 గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
సెంట్రల్ గోడౌన్ భవన నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంగళవారం జరుగనున్న ఈవో సమీక్షలో ఆరోగ్యశ్రీ భవన నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. స్విమ్స్లో అగ్నిమాపక వ్యవస్థ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్రెడ్డి, స్విమ్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.