అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పీఆర్సీ అంశాలతో పాటు ఉద్యోగుల ఆందోళనలను, ఇతర సమస్యలను చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఉద్యోగులకు నచ్చేజెప్పేందుకు వేసిన కమిటీలో మంత్రులు పేర్నినాని, సజ్జల, బొత్స సత్యనారాయణ, భుగ్గనతో పాటు సీఎస్ సభ్యులుగా ఉంటారు.
మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపు , కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటంబాలకు , గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 10శాతం ప్రభుత్వ, ఉద్యోగులకు కేటాయింపు , ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5శాతం ప్లాట్లు కేటాయింపు , ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.