Suicide : శ్రీకాకుళం జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ప్రత్తిపాటి సృజన్ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
సృజన్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు సృజన్ మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.