అమరావతి : ఏపీలో ఈనెల 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను ఉద్యోగ సంఘాలు విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేర్కొన్నారు. సమ్మె చేస్తే ఏమొస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు చెబితేనే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. సమ్మె విరమించుకుని చర్చలకు రావాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. రెండున్నరేండ్లుగా ఐఆర్ ఇస్తున్నామని అన్నారు.
మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒకచోట అడ్జెస్ట్ చేయాలని వివరించారు. పే స్లిప్ ఓవరాల్గా చూస్తే ఉద్యోగులకు గ్రాస్ శాలరీ పెరిగిందని వెల్లడించారు. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులున్నా ఐఆర్ను పెంచామని తెలిపారు.