అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, వారి ముఖ్య అనుచరుడు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంట్లోకి రానీయకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.
తాడిపత్రితోపాటు హైదరాబాద్లోని జేసీ సోదరుల ఇండ్లలోకూడా అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై వారిని ప్రశ్నిస్తున్నారు.