అమరావతి : విశాఖనగరంలోని పోర్ట్టౌన్ పీఎస్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ సెల్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త దాడిలో పోలీసులు డ్రగ్స్ను పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరివద్ద నుంచి 50ఎల్ఎస్డీ బ్లాట్స్ డ్రగ్స్ను పట్టుకుని సీజ్ చేశారు. నిందితులు క్రిఫ్టో కరెన్సీ ద్వారా బ్లాట్స్ డ్రగ్స్నుకొనుగోలు చేశారని వివరించారు.
ఈ కేసులో మరికొంతమంది . గోవా నుంచి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని పట్టుకోవాల్సి ఉందని తెలిపారు. డ్రగ్స్ను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి విడతల వారీగా రెండింతలకు విక్రయించే ముఠాలోని ఐదుగురిని పట్టుకున్నామని నగర పోలీసు అధికారులు తెలిపారు. కేసులో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని , వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.