అమరావతి: అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతానని పేర్కొన్నారు. అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలి మెడిసిన్ రంగం ఆంధ్రప్రదేశ్ కు చేరువ అయ్యేలా పనిచేస్తామని అన్నారు.
వైద్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడుల సేకరణకు, నిధుల సమీకరణకు కృషి చేస్తానని వాసుదేవరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ వాసుదేవరెడ్డి స్వస్థలం. సిద్దార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో ఎంబిబీఎస్ పూర్తి చేశారు. అసంతరం అమెరికా వెళ్లి మెల్ బోర్న్ (ఫ్లోరిడా రాష్ట్రం)లో వైద్యులుగా స్థిరపడ్డారు. గత 22 రెండేళ్లుగా ఎం.డీ ఫ్యామిలీ మెడిసిన్, ఎం.ఎస్ పబ్లిక్ హెల్త్ నిపుణులుగా సేవలు అందిస్తున్నారు.